Breaking News

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హైదరాబాద్ విజయభారతి న్యూస్ ; జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రోజు సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ) 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్. హరీష్, దేవులపల్లి అమర్, ఐజేయు మాజీ అధ్యక్షులు, కే.విరాహత్ అలీ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు, కె.రాంనారాయణ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి, ఐజేయు, కె. సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఐజేయు, కల్కూరి రాములు, ఉప ప్రధాన కార్యదర్శి, టీయుడబ్ల్యూజే, కె. శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి, టీయుడబ్ల్యూజే, యం. వెంకట్ రెడ్డి, కోశాధికారి, టీయుడబ్ల్యూజే, ఏ. రాజేష్, బి. కిరణ్, గౌస్ మోహియుద్దీన్, అనీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, టీయుడబ్ల్యూజే, హెచ్.యూ.జే. అధ్యక్షులు, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *