
విజయభారతి: హైదరాబాద్ న్యూస్ Jul 04, 2026,
టీచర్లకు బ్రేక్ఫాస్ట్, లంచ్ వద్దు: PRTU
తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, TPRTU వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్థన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఉపాధ్యాయులకు వెచ్చించే ఖర్చును.. విద్యార్థులకే కేటాయించి మరింత నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
