
నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.42 కోట్ల నిధులతో పలు గ్రామీణ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. ఈ నిధులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.ప్రధానంగా గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడేలా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించడంతో పాటు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర వైద్య సేవల కోసం ప్రయాణించే ప్రజలకు ఈ రహదారులు ఎంతో ఉపయుక్తంగా మారనున్నాయి.
నిధుల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మరిన్ని మౌలిక సదుపాయాల పనులను తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.త్వరలోనే పనులకు టెండర్లు పూర్తి చేసి, నాణ్యత ప్రమాణాలతో రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. రూ.42 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులు పూర్తయితే నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి..
