
ఆర్మూర్ మండలం మంతెన గ్రామానికి చెందిన నక్కల సాయమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.1.75 లక్షల చెక్కును కాంగ్రెస్ నాయకులు, ఉజ్వల ట్రస్ట్ వ్యవస్థాపకులు మినీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంగళవారం అందజేశారు.ఈ సందర్భంగా మినీ శ్రీకాంత్ మాట్లాడుతూ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు వైద్య చికిత్స కోసం అందిస్తున్న సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వకీల్ గంగారెడ్డి, నక్కల సాయిరెడ్డి, విష్ణు గౌడ్, రాజేందర్ ప్రసాద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
