
విజయభారతి : ఆలూరు న్యూస్
ఆలూరు మండల కేంద్రంలోని మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయంలో (ప్రీ-ప్రైమరీ) బోధకులు మరియు ఆయాల నియామక ప్రక్రియలో భాగంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక జాబితాను మంగళవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి ఎం. నరేందర్ మాట్లాడుతూ, విడుదల చేసిన జాబితాపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే వాటిని రేపటిలోగా లిఖితపూర్వకంగా మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. అందిన అభ్యంతరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.
అభ్యర్థులు కార్యాలయంలో ప్రదర్శించిన ఎంపిక జాబితాను పరిశీలించి, ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా తెలియజేయాలని ఎంఈఓ సూచించారు.
