
విజయభారతి : హనుమకొండ న్యూస్ జూలై 8
హనుమకొండ జిల్లా: అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని బాలుడు నిరంజన్ మృతి చెందాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశాడు.
నిరంజన్ అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల అతని ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ను ప్రత్యక్షంగా కలిసిన ఆనందం నిరంజన్ కుటుంబానికి ఎంతో భావోద్వేగంగా నిలిచింది.
బాలుడు నిరంజన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే అరుదైన వ్యాధితో పోరాడిన నిరంజన్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
ఫోటో క్యాప్షన్: ఇటీవల హనుమకొండలో అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ను పరామర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
