Breaking News

డాక్టర్ వైఎస్సార్ జయంతి ఘనంగా నిర్వహణ…. ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులు

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 8

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం…. పిప్రి బాలుర జూనియర్ కళాశాలలో పోలీసుల అవగాహన సదస్సు…. ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ వెల్లడి….

ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, విద్యా–వైద్య రంగాల అభివృద్ధికి డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వెంకట్రాంరెడ్డి, పండిత్ పవన్, వెంకటగిరి వాసు, మురళీధర్, జిమ్మరవి, మోసిన్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *