Breaking News

ప్రతి బుధవారం ఆర్మూర్ ఎంజే హాస్పిటల్‌లో నరాల వైద్య నిపుణుడు డాక్టర్ మోసిన్ సేవలు

విజయభారతి ఆర్మూర్, జూలై 8:

ఆర్మూర్ పట్టణ ప్రజలకు శుభవార్త. నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్య సంస్థ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నరాల వైద్య నిపుణుడు డాక్టర్ మోసిన్ ప్రతి బుధవారం ఆర్మూర్‌లోని ఎంజే హాస్పిటల్‌లో అందుబాటులో ఉంటారని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.మెదడు, వెన్నుపాము, నరాలకు సంబంధించిన వివిధ సమస్యలతో బాధపడుతున్న రోగులకు డాక్టర్ మోసిన్ నిపుణుల వైద్య సలహాలు, అవసరమైన చికిత్స అందించనున్నారు. తలనొప్పి, మైగ్రేన్, పక్షవాతం, మూర్ఛ వ్యాధి, నరాల బలహీనత, చేతులు–కాళ్లలో తిమ్మిర్లు, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి నరాల సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
నరాల సమస్యలతో బాధపడుతున్న రోగులు ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్మూర్‌లోని ఎంజే హాస్పిటల్‌ను సందర్శించి డాక్టర్ మోసిన్ సేవలను వినియోగించుకోవాలని హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటనలో కోరింది.ఈ సందర్భంగా ఎంజే హాస్పిటల్‌కు చెందిన సీనియర్ జనరల్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ మధుశేఖర్, నరాల వైద్య నిపుణుడు డాక్టర్ మోసిన్ పాల్గొన్నారు.వివరాలు:స్థలం: ఎంజే హాస్పిటల్, ఆర్మూర్రోజు: ప్రతి బుధవారంసమయం: ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకువైద్య నిపుణుడు: డాక్టర్ మోసిన్, నరాల వైద్య నిపుణుడు

దేగాం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *