Breaking News

జాతీయ అవార్డు గ్రహీత పట్వారీ తులసి కుమార్‌కు ఘన సన్మానం

విజయభారతి; ఆర్మూర్ న్యూస్ జూలై 9

ఆర్మూర్, జిరాయత్‌నగర్: ఆర్మూర్ మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల జిరాయత్‌నగర్‌లో చదివిన పూర్వ విద్యార్థి పట్వారీ తులసి కుమార్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పట్వారీ తులసి కుమార్ మాట్లాడుతూ, తాను ఇదే పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి, అనంతరం ఉన్నత చదువులు పూర్తి చేసి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆర్మూర్ పట్టణ సమాజానికి తనవంతు సేవలు అందిస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి, భవిష్యత్తులో ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి తమవంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కె. సంతోషి రాణి, ఉపాధ్యాయులు హెప్సిబా, సదియా తబస్సుం, అదిబా, తహ్నియత్, పీఆర్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి. లక్ష్మీనారాయణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

క్రమశిక్షణ, విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఆలయమే పాఠశాల – మానస గణేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *