Breaking News

శోభన్ బాబు సతీమణి కన్నుమూత…!

విజయభారతి: హైదరాబాద్ :న్యూస్ జులై 10 రిపోర్టర్ ;సుంకరి; గంగ మోహన్


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది దివంగత నటభూషణ్, హీరో శోభన్ బాబు సతీ మణి శాంతకుమారి, గురువారం రాత్రి కన్ను మూశారు. చెన్నైలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న ఆమె.. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నై లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారుఈ విషయాన్ని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. శాంత కుమారి మరణవార్త తెలిసిన వెంటనే సినీ అభిమానులు, సినీ ప్రముఖులు, దిగ్ర్భాం తికి గురయ్యారు. శుక్రవారం మధ్యా హ్నం శాంతకుమారి, అంత్య క్రియలు చెన్నైలో నిర్వహించ నున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.1958 మే 15న శోభన్ బాబు, శాంతకుమారి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తెలుగు సినీ రంగంలో హీరోగా ఓ వెలుగు వెలిగారు శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథల తో రూపొందించిన చిత్రాలతో తెలుగు ప్రేక్ష కుల హృదయాలను గెలుచుకున్నారు.సౌత్ ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నారు. చివరి శ్వాస వరకు హీరోగానే నటిస్తానని చెప్పిన శోభన్ బాబు పలు చిత్రాల అవకాశా లను సైతం వదులు కున్నారు. 2008లో గుండెపోటుతో శోభన్ బాబు, కన్ను మూసిన సంగతి పాఠకులకు తెలిసింది.

చల్‌గల్‌లో కేవి కి 5 ఎకరాల కేటాయింపు బీజేపీ పోరాట ఫలితమే…. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం…. మరో 5 ఎకరాలు స్థలం కోసం ఉద్యమిస్తాం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *