Breaking News

ఆలూర్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం… పరిశీలించిన తహసీల్దార్ రమేష్.. శని, ఆదివారాల్లో ఫారాలు సమర్పించాలని సూచన….

.

విజయభారతి : ఆలూరు న్యూస్ : జూలై 10 రిపోర్టర్ సుంకరి: గంగా మోహన్

మచర్ల జడ్పీహెచ్ఎస్‌కు 25 డ్యూయల్ డెస్క్ బెంచీల విరాళం…

ఆలూర్ మండలంలోని ఆలూర్, గగుపల్లి, రామచంద్రపల్లి, గుత్ప గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తహసీల్దార్ రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను తనిఖీ చేసి, బీఎల్‌వోలు చేపడుతున్న నమోదు ప్రక్రియపై ఆరా తీశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ఈ శని, ఆదివారాల్లోపు సంబంధిత బీఎల్‌వోలకు అందజేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రెండో శని, ఆదివారాల్లో కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫారాల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయడంలో బిఎల్ఏ ఏజెంట్లు,అధికారులు, ప్రజలు సమన్వయంతో సహకరించాలని కోరారు. ప్రతి అర్హ ఓటరు వివరాలు జాబితాలో నమోదయ్యేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో జీపీఓ అజయ్, సప్తగిరి,గ్రామ పంచాయతీ కరాబర్ సంతోష్ తదితరులు పాలుగోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *