
విజయభారతి: ఆలూరు న్యూస్ జూలై 10
ఆలూర్ మండలం కల్లడి గ్రామంలో 07 గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుస్మిత ప్రళయ్ తేజ్ మాట్లాడుతూ కల్లడి గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్య రీత్యా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చులను సీఎంఆర్ ద్వారా ఇప్పిస్తానని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి అనారోగ్యంతో ఉంటే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎల్ఓసి ఇప్పించి వైద్య సేవలు అందేలా చూస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కున్సోత్ కిసాన్ , పూదరి నరేందర్ సార్, బోడిగం నాగేష్, కాండ్రే సాయిచరణ్,సిరికొండ భూమన్న, భాషేట్టి ప్రతాప్, దాసరి రాధాస్వామి, పురస్త్ భూమన్న,బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
