Breaking News

మామిడిపల్లిలో ఈ-ఎఫ్ డిజిటలైజేషన్ పురోగతిపై సబ్ కలెక్టర్ సమీక్ష….

విజయభారతి :ఆర్మూర్, న్యూస్ జూలై 14:

ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో ఈ-ఎఫ్ డిజిటలైజేషన్ కార్యక్రమం పురోగతిని సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజల వివరాల సేకరణ ప్రక్రియను పరిశీలించారు.
డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా కొనసాగాలని అధికారులకు సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను కచ్చితంగా నమోదు చేయడంతో పాటు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజలు కూడా తమ పూర్తి వివరాలను అధికారులకు అందించి ప్రభుత్వ డిజిటలైజేషన్ కార్యక్రమానికి సహకరించాలని సబ్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పెర్కిట్ జడ్‌పీహెచ్‌ఎస్‌లో సామాజిక తనిఖీ…. నిర్వహణ పాఠశాల రికార్డులు, మౌలిక వసతులు పై ….. విద్యార్థులకు అందుతున్న సేవలపై జిల్లా విద్యాశాఖ అధికారిణి హరిణి సమగ్ర పరిశీలన….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *