
విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 17 రిపోర్టర్ సుంకరి : గంగామోహన్
ఆర్మూర్ మండలంలోని పల్లె (హరిపూర్) గ్రామంలో ప్రొద్దుటూరి వెంకట్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 28 మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, యూనిఫాం బట్టలు, షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజీవ్, వీడీసీ కోశాధికారి సాయంగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు తమ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజీవ్ మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహకరమని అన్నారు. గ్రామంలోని చిన్నారులకు ప్రతి సంవత్సరం అవసరమైన సహాయాన్ని అందిస్తూ ప్రొద్దుటూరి వెంకట్ నారాయణరెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
తన తండ్రి దివంగత రుక్మారెడ్డి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాలను కొనసాగించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. రుక్మారెడ్డికి గ్రామంతో ఉన్న అనుబంధాన్ని ఆయన కుమారులు వెంకట్ నారాయణరెడ్డి కొనసాగించడం గ్రామానికి గర్వకారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగారం, ఉపాధ్యాయుడు రమేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు లక్కవత్రి రాంసన్, వీడీసీ సభ్యులు పట్నూరి అశోక్, పూజారి శ్రీనివాస్, రాగం నరేష్, మంగలి శ్రవణ్, రుక్మారెడ్డి ఫంక్షన్ హాల్ సూపర్వైజర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
