Breaking News

ఆర్మూర్‌లో మహిళ ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు…..

విజయభారతి :ఆర్మూర్, జూలై 17: రిపోర్టర్: సుంకరి: గంగా మోహన్

నీట్-2026లో ప్రతిభ కనబర్చిన మాలావత్ ప్రజ్ఞాహితకు బుస్సాపూర్ శంకర్ అభినందనలు… విద్యార్థుల విజయాలే సమాజానికి స్ఫూర్తి: బుస్సాపూర్ శంకర్….

ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ కట్ట టీచర్స్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన వేముల లక్ష్మి (39) గురువారం రాత్రి తన నివాసంలోని బెడ్‌రూమ్‌లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో లక్ష్మి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి లోపల నుంచి తలుపు వేసుకుంది. చాలా సేపు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, ఆమె చీరతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే చీరను కోసి 108 అంబులెన్స్‌లో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతురాలి భర్త రవి సుమారు 20 సంవత్సరాల క్రితం మానసిక స్థితి సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే ఆమెకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిసింది.మృతురాలికి కూడా కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఉండేవని, అప్పుడప్పుడు అసాధారణంగా ప్రవర్తించేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి ఎదురుగా నివసించే ఆమె సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *