
విజయభారతి :నిజామాబాద్, జూలై 17: రిపోర్టర్ సుంకరి;గంగా మోహన్
నీట్ యూజీ 2026 పరీక్షలో 438 మార్కులు సాధించి, 90.46 పర్సెంటైల్తో పాటు ఎస్టి కేటగిరీలో ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంక్ 3668 సాధించి ప్రతిభ చాటిన మాలావత్ ప్రజ్ఞాహితకు బీజేపీ నేత , తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టి సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, బిసి సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజ్ఞాహిత సాధించిన విజయం ఆమె కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి నిదర్శనమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచగలరని ఈ ఫలితం నిరూపించిందన్నారు.అలాగే, మాలావత్ ప్రజ్ఞాహిత భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేసే గొప్ప వైద్యురాలిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు.విద్యే గొప్ప ఆయుధం. కష్టపడి చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు.ప్రజ్ఞాహిత విజయం మరెందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి” అని బుస్సాపూర్ శంకర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు బాబా శ్రీనివాస్ , బీసీ సాధికారత సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పసుల లక్ష్మణ్ , కరిపే గంగాధర్ , పూర్ణచందర్ గారు తదితరులు పాల్గొన్నారు
