
విజయభారతి : ఆర్మూర్ నియోజకవర్గం న్యూస్ జూలై 14
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ బుధవారం పలువురు బీజేపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు, అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ కార్యకర్తలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 9:30 గంటలకు ఒడ్డేట్పల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్త శేఖర్ గారి తండ్రి మృతి నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఉదయం 10:00 గంటలకు అమ్రాద్ గ్రామంలో కే. రెడ్డి రాజేందర్ గారి తల్లి మృతి నేపథ్యంలో, 10:30 గంటలకు మాణిక్ బండార్ గ్రామంలో ఆకుల రాకేష్, అజయ్ గారి తండ్రి మృతి నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.ఉదయం 11:00 గంటలకు బోర్గం (కే) గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకుడు దేశెట్టి ప్రవీణ్ గారి అన్న మృతి నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించనున్న ఎమ్మెల్యే, అనంతరం ఉదయం 11:15 గంటలకు అదే గ్రామానికి చెందిన బీజేపీ బూత్ సెక్రటరీ పల్నాటి నవీన్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు.తదుపరి ఉదయం 11:45 గంటలకు గొట్టుముకుల గ్రామంలో బీజేపీ కార్యకర్త రవి గారి తండ్రి మృతి నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు మెట్పల్లి గ్రామంలో అనారోగ్యంతో ఉన్న బీజేపీ కార్యకర్త భామని రాజును పరామర్శించి, అనంతరం మధ్యాహ్నం 12:45 గంటలకు మాందాపూర్ గ్రామంలో బీజేపీ బూత్ అధ్యక్షుడు గోపాల్ గారి అన్న మృతి నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శిస్తారు.
ఈ పర్యటనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొని సహకరించాలని నిర్వాహకులు కోరారు.
