Breaking News

పట్టు చేనేత సహకార సంఘం డైరెక్టర్‌గా ఎన్నికైన ఖాందేశ్ సత్యంకు రోటరీ క్లబ్ ఘన సన్మానం…

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 17 రిపోర్టర్ సుంకరి గంగా మోహన్

ఆర్మూర్ శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం.. తప్పిన పెను ముప్పు….

ఆర్మూర్: పట్టు చేనేత సహకార సంఘం డైరెక్టర్‌గా నూతనంగా ఎన్నికైన రొటరియన్ ఖాందేశ్ సత్యంను రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సభ్యులు ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు వన్నెల్ దేవి రాము, కార్యదర్శి పి.వి.ఆర్. శ్రీకాంత్, కోశాధికారి రాస ఆనంద్ ఆధ్వర్యంలో పూల బొకే, శాలువాతో ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా ఖాందేశ్ సత్యం మాట్లాడుతూ, ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి నేత కార్మికుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ 3150 మాజీ గవర్నర్ హన్మంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, రోటరియన్లు దాసరి సునీల్ కుమార్, చరణ్ రెడ్డి, వంగ వివేకానంద, రాధాకిషన్, సురేష్, చోటి లింబాద్రి, చెలిమేల రాజేందర్, కత్రాజీ రాజేందర్, మారుతీ తదితరులు పాల్గొని ఖాందేశ్ సత్యంకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *