
విజయభారతి ఆర్మూర్ న్యూస్, జూలై 17:
ఆర్మూర్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ సందర్శించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ప్రజలకు ఓటరు నమోదు, మార్పులు, సవరణలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. బూత్లలో అందుబాటులో ఉన్న ఎస్ఐఆర్ దరఖాస్తు ఫారాలు, వాటి వివరాలను అడిగి తెలుసుకుని, ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని 76, 63, 64వ పోలింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ సందర్శించి, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
