
విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 17
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్ 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన HR 38 AD 2156 నంబర్ గల లారీ, రహదారి పక్కన ఆగి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో బస్సుకు స్వల్ప నష్టం జరిగినట్లు సమాచారం సమాచారం అందుకున్న స్థానికులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
