విజయభారతి శేరిలింగంపల్లి న్యూస్ ; శేరిలింగంపల్లి తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇంచార్జ్ గా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ను నియమించినందుకు టి ఆర్ ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితను శేరిలింగంపల్లి టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు గురువారం రోజు ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికుల కష్టపడి పనిచేయాలని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసి కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను కూడా తను మరువనని ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తించి పదవులు అందజేస్తుందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో టి ఆర్ ఎస్ పార్టీ జెండా ఎగురవేసి వాసవి చంద్రశేఖర్ ప్రసాదను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ పార్టీ సినీయర్ నాయకులు కొల్లూరు కుమార్, లావణ్య బండారి, దయానంద, అస్లాం, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

