జర్నలిస్ట్ కుటుంబాలకు అండగా ఉంటా శేరిలింగంపల్లి వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తా – వాసిలి చెంద్రశేఖర్ ప్రసాద్
శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ;
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ను ప్రకటించిన సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మియపూర్ శుభం కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి తెలంగాణ రక్షణ సేన అసెంబ్లీ ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర ప్రసాద్ మాట్లాడుతూ. టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్క విడుదల చేసిన నియోజకవర్గాల తొలి జాబితాలో తనకు చోటు ఇచ్చినందుకు ఆమెకు ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. ఈ శుభ సందర్భంలో మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని అదేవిధంగా శేరిలింగంపల్లి వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఆరోగ్య భద్రత కోసం ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తానని దానికి ఎంత ఖర్చైనా
ప్రీమియం మొత్తం నేనే భరిస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ కార్యకర్తలు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ను పూల బుకే ఇచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొల్లూరు కుమార్, బండారి లావణ్య, మురుగన్ వేలు, దయానంద్ ముదిరాజ్, అస్లాం, విష్ణు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

