Breaking News

ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఎన్‌ఎఫ్‌బీఎస్ కింద రూ.20 వేల ఆర్థిక సాయం.. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సురకంటి చిన్నారెడ్డి.. పల్లె సర్పంచ్ సాధ్యం మనిషా సంజు..

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత….

విజయభారతి : ఆర్మూర్ మండలం న్యూస్ జూలై 18 రిపోర్టర్ సుంకరి: గంగ మోహన్

ఆర్మూర్: మండలం హరిపూర్ పల్లె గ్రామంలో కుటుంబాలకు అండగా నిలిచే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్)ను బీపీఎల్ కుటుంబాల అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సురకంటి చిన్నారెడ్డి సూచించారు.
శనివారం ఆర్మూర్ మండలంలోని పల్లె (హరిపూర్) గ్రామంలో ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుడికి రూ.20 వేల విలువైన చెక్కును అందజేశారు. గ్రామ సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజీవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్క రంజిత్ చేతుల మీదుగా, సురకంటి చిన్నారెడ్డి సమక్షంలో చెక్కును పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ, కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చేపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ జన్నేపల్లి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు రాంసన్, జోరిగే ధర్మయ్య, సాయంగౌడ్, కొంపల్లి సుధాకర్, ఆది శ్రీను, దేవరాజ్, నితిన్ రాజ్, భూమేష్, సర్దా బాపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *