
విజయభారతి ; ఆలూరు న్యూస్ జూలై 18
ఆలూర్ మండలంలోని గుత్ప గ్రామానికి చెందిన యగ్నేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్నికి మున్నూరు కాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో శశికుమార్, అనిల్, త్రినేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
