Breaking News

ఆకుల రాజు తండ్రి మృతిపై అయ్యప్ప ఫౌండేషన్ సభ్యుల ప్రగాఢ సానుభూతి…. కుటుంబ సభ్యులను పరామర్శించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్….

(విజయభారతి) ఆర్మూర్ న్యూస్: ఆగస్ట్: 01

డొంకేశ్వర్ మండల అభివృద్ధికి కృషి చేస్తా…. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….

ఆర్మూర్ పట్టణానికి చెందిన మాజీ సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజు తండ్రి ఇటీవల అకాల మరణం చెందడంతో అయ్యప్ప ఫౌండేషన్ సభ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులనుపరామర్శించారు. ఈ సందర్భంగా మృతునికినివాళులర్పించికుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతితెలియజేశారు.ఈపరామర్శకార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెపూర్ గణేష్‌తో పాటు సభ్యులు షేర్ ఒడ్డెన్న, వజ్ర ఒడ్డెన్న, నరేష్, లింగం, భాస్కర్, సన్నీ, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని అయ్యప్ప ఫౌండేషన్ సభ్యులు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అయ్యప్ప పౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ… కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోవడం చాలా బాధాకరమని ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు వారు విలువ తెలియదు కానీ వారు స్వర్గస్తులైనప్పుడు వారి విలువ ఏంటో మనకు తెలుస్తుందని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు ఆ భగవంతుడా కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *