
విజయభారతి ఆర్మూర్ న్యూస్, ఆగష్టు 05
ఆర్మూర్ మండలంలోని పల్లె (హరిపూర్) గ్రామపంచాయతీకి ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరంకుశం శ్యాంసుందర్ వారి తండ్రి క్రీస్తు శేషులు మర్రిగడ్డ నర్సయ్య జ్ఞాపకార్థం 15 వేళారుపాయల విలువగల దోమల కిల్లింగ్ మిషన్ బుధవారం గ్రామ సర్పంచ్ పార్దేమ్ మనీషా సంజీవ్ కు అందజేశారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మన పల్లె ప్రజలు దోమల బారిన పడకుండా ఉండాలని దోమల కిల్లింగ్ మిషన్ వితరణ చేసిన ఇదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ కు గ్రామస్తులు తరఫున తన పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే ముందు ముందు సేవ మార్గంలో ముందు ఉండాలని ఆకాంక్షించారు దీంతో గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేశారు
