
(విజయభారతి), జక్రాన్పల్లి న్యూస్ :ఆగస్టు 5
జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామానికి చెందిన కమ్మరి సోని (20), భర్త సురేష్కు బుధవారం అకస్మాత్తుగా ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ (వాహనం నం. TS08UL5236) సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గర్భిణిని ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికితరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రసవ నొప్పులుతీవ్రతరమయ్యాయి.పరిస్థితిని వెంటనే అంచనా వేసిన ఈఎంటి రాథోడ్ జగదీష్, పైలట్ నరేందర్ సమయస్ఫూర్తితో వ్యవహరించిఅంబులెన్స్లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. అనంతరం తల్లి, నవజాత శిశువును మెరుగైన వైద్య చికిత్స కోసం ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చేర్పించారు.ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అత్యవసర సమయంలో చాకచక్యంగా స్పందించి సురక్షిత ప్రసవం జరిపిన 108 ఈఎంటి జగదీష్, పైలట్ నరేందర్లను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందిస్తూ వారి సేవలను ప్రశంసించారు.
