Breaking News

హైదరాబాద్ లో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య!

శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయ భారతి న్యూస్ ; గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆదివారం రోజు సాయంత్రం ఆత్మహత్య చేసుకొంది. కన్నడలో చాలా సీరియల్ లో నటించిన యాంకర్ శోభిత ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు తెలిసింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. కన్నడలోని పలు సీరియల్ లో నటించిన శోభిత వివాహం చేసుకుని హైదారాబాద్ షిఫ్ట్ అయి గచ్చిబౌలిలో కొంతకాలంగా నివాసం ఉంటోంది. శోభిత ఆత్మహత్య కు గల కారణాలు శోభిత కుటుంబ సభ్యులు బయట పెట్టడం లేదు కుటుంబ సభ్యులు. శోభిత మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండు ఒండ్ల మూడు, ఏటీఎం, ఒక్క కథే కెల్తా, జాక్‌పాట్, అపార్ట్‌మెంట్ టు మర్డర్, వందన వంటి కర్ణాటక సినిమాల్లో నటించింది శోభిత.అలాగే బ్రహ్మగంతు, నీనిదలేలో సీరియల్స్ లో కూడా ఆమె నటించింది. గచ్చిబౌలి లో శ్రీరామ్ నగర్ కాలనీ లో భర్త సుధీర్ తో కలిసి నివాసం ఉంటోంది నటి శోభిత(32). ఈ రోజు తాను ఉంటున్న ఇంట్లోనీ సీలింగ్ ఫ్యాన్ కు చీర తో ఊరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియ వలసి ఉంది, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *