విజయభారతి న్యూస్ రంగారెడ్డి జిల్లా ; రంగారెడ్డి జిల్లాలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద అదుపు తప్పిన లారీ ఫుడ్ పాత్పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్పాత్ పై కూరగాయలు అమ్మేవారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా మృతి చెందారు. దీంతో పాటు ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.



