Breaking News

మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్నం భోజనం మెనూ ను పరిశీలించి, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వడ్డించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే మరియు పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ.
విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మెను వివరాలు, ఉపాధ్యాయులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటశాల లోని బియ్యాన్ని, సరుకులను నాణ్యతను పరిశీలించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ కు వంట సిబ్బందికి తెలియజేశారు.
విద్యార్థులకు శుచి శుభ్రతతో కూడిన చక్కటి రుచికరమైన భోజనం అందించాలని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవాలని విద్యార్థులకు మంచి పౌష్టికాహారం తో కూడిన భోజనం తో పాటు మంచి విద్య ను అందించినప్పుడే వారికి ఉజ్వల భవిష్యత్తును ఇచ్చినవారం అవుతామని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిఆరోహించాచాలని విద్యార్థులకు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు యాదగిరి గౌడ్, రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *