
విజయభారతి : హైదరాబాద్ న్యూస్ రిపోర్టర్ సుంకరి;గంగా మోహన్
ఇటీవల కాలంలో చికెన్ ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ అందుబాటులో లేకుండా పోయింది.వారం రోజులుగా ధరలు పైపైకి ఎగబాకుతూ, ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.360కు చేరింది.పది రోజుల క్రితం దీని ధర రూ.240 మాత్రమే ఉండటం గమనార్హం.అలాగే, స్కిన్తో కూడిన చికెన్ ప్రస్తుతం కిలో రూ.300 వరకు విక్రయిస్తుండగా, బ్రాయిలర్ లైవ్ కోడి (బర్డ్) ధర కిలో రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతోంది.
