Breaking News

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్! ఉగ్రవాది జాకీర్ అహ్మద్ హతం…

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్!

ఉగ్రవాది జాకీర్ అహ్మద్ హతం!

దేగాం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

విజయభారతి :హైదరాబాద్:జులై 08

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ చేపట్టిన భద్రత బలగాలు భారీ విజయం సాధించా యి, సోఫియాన్ లోని ఓ పండ్ల తోటలో నక్కి ఉన్న ఉగ్రవాదుల్లో ఒకరిని ఈరోజు హతమార్చాయి.ఉగ్రవాదులు నడుచు కుంటూ వెళ్తున్న దృశ్యాలు ఇటీవల నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయి. దాంతో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ దళాలు జూలై న సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని నలుమూల ల మూడు రోజుల నుంచి తోటలో దిగ్బంధించి వేట మొదలుపెట్టాయి. దాదాపు ఐదు రోజులుగా కొనసాగు తున్న ఈ ఆపరేషన్‌లో బుధవారం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది.భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదు లు కాల్పులు జరిపా రు. దీంతో సిబ్బంది ఎదురుకాల్పులు జరిపినట్లు అధికారు లు వెల్లడించారు. అనంతరం ఘటనా స్థలంలో ఓ ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించారు. అతడిని జాకిర్‌ అహ్మద్ ఘ‌నీగా తేల్చారు. అతడితో పాటు ఉన్న మరో ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ కోసం భద్రతా బల గాలు గాలిస్తున్నాయి. అతడు బయటకు వెళ్లకుండా తోట చుట్టూ విక్టర్‌ ఫోర్స్‌ దళాలు మోహరించి నట్లు అధికారులు తెలిపారు.కుల్గామ్‌కు చెందిన జాకిర్ ఘ‌నీ కొన్నేళ్లుగా లష్కరే తయ్యిబా ముఠాలో కీలకంగా పనిచేస్తున్నాడు. గతంలో భద్రతా సిబ్బందిపై దాడులు, పౌరుల హత్యల కేసు ల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *