
శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మహిళల మృతి
విజయభారతి : హైదరాబాద్:జులై 09
హైదరాబాద్ లోని శంషాబాద్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం అదుపుతప్పి బస్టాండ్లో వేచిఉన్న మహిళలపైకి దూసుకె ళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణిం చగా.. మరికొందరికి గాయాలయ్యాయి.గురువారం తెల్లవారు జామున సతమరాయి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి బస్టాప్ లో వేచిఉన్న ప్రయాణి కులపైకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మర ణించారు. మరికొందరి కి గాయా లైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు .అప్పటికే ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. గాయపడి న వారిని స్థానిక ఆస్ప త్రికి తరలించారు. శంషాబాద్ ఏరియాలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు బొలెరో వాహనాన్ని పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించా రు. ప్రమాదానికి ఆసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
