Breaking News

తెలంగాణలో జులై 24న విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు…….

విజయభారతి :న్యూస్, : హైదరాబాద్జు లై 22:

నీట్ పరీక్షలో అవకతవకలు, వరుస పేపర్ లీకేజీల ఘటనలపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేసి, పారదర్శకమైన పరీక్షల విధానాన్ని అమలు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. ఈ బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌బీతో పాటు పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.
ఇటీవల ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, యువతపై పోలీసులు దాడులకు పాల్పడడాన్ని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలను అణచివేయడం కాకుండా, పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

డాక్టర్ అవతారమెత్తిన మెడికల్ షాప్ ఓనర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *