
విజయభారతి హైదరాబాద్ న్యూస్ Jul 23, 2026,
తెలంగాణలో బీజేపీ ఎన్నికల వ్యూహాలు.. మూడు సర్వే సంస్థల ఎంట్రీ!
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన క్షేత్రస్థాయి కార్యాచరణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో, ‘అభీష్ట’, ‘ఏబీఎం’, మరియు ‘జార్వీస్’ అనే మూడు సర్వే సంస్థలు, ఏజెన్సీలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ‘అభీష్ట’ సంస్థ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను, మున్సిపల్ ఎన్నికలను పరిశీలిస్తూ, బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం పర్యవేక్షిస్తున్న ‘ఏబీఎం’ సంస్థ బీజేపీ ఎజెండా, ప్రచార వ్యూహాలపై పనిచేస్తోంది. ‘జార్వీస్’ సంస్థ ఎన్నికల సన్నాహాలు, కార్యక్రమాల రూపకల్పనతో పాటు, ఓటర్ల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించడం, బూత్ కమిటీల నియామకం, కార్యకర్తల సమీకరణ వంటి అంశాలను పర్యవేక్షిస్తోంది.
