Breaking News

ధేగం సర్పంచ్ తండ్రి మృతి పట్ల అయ్యప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతాపన…. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్….

(విజయభారతి – ఆర్మూర్ న్యూస్)

ధేగం గ్రామ సర్పంచ్ తండ్రి ఇటీవల పరమపదించిన నేపథ్యంలో ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్, అయ్యప్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అయ్యప్ప ఆలయ నిర్మాణకర్త అయ్యప్ప శ్రీనివాస్ తన చిన్ననాటి మిత్రుడు, క్లాస్‌మేట్ అయిన ఇట్టేడి లింగారెడ్డి నివాసానికి అయ్యప్ప ఫౌండేషన్ సభ్యులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ, భగవంతుడు దివంగత ఆత్మకు శాంతి ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో అయ్యప్ప ఫౌండేషన్‌ను స్థాపించామని, పేదలు, నిరుపేదలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఫౌండేషన్ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

డాక్టర్ అవతారమెత్తిన మెడికల్ షాప్ ఓనర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *