ఏర్గట్ల కేజీబీవీ పాఠశాలకు రూ.2 లక్షల విలువైన 45 డిస్క్ బెంచీల విరాళం
విజయభారతి ఏర్గట్ల
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులకు డిస్క్ బెంచీల కొరత ఉందని తెలుసుకున్న వసంత టూల్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఏనుగు దయానంద్ రెడ్డి, సుమారు రూ.2 లక్షల విలువైన 45 డిస్క్ బెంచీలను విరాళంగా అందించారు.ఈ సహాయం త్వరితగతిన పాఠశాలకు చేరేలా బాల్కొండ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో విద్యార్థినులకు ఎంతో ఉపయోగకరంగా ఉందనిఈ డిస్క్ బెంచీలను ఎర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి విద్యార్థినులకు పంపిణీ చేశారు.

