Breaking News

విద్యా సంస్థల్లో డ్రగ్స్‌కు చెక్….యాజమాన్యాలకూ బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి…. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చట్టాలపై అధ్యయనం…. క్యాంపస్‌లలో టోల్‌ఫ్రీ నంబర్, క్యూఆర్ కోడ్ ఏర్పాటు…..

యాజమాన్యాలకూ బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి….

మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చట్టాలపై అధ్యయనం….

డాక్టర్ అవతారమెత్తిన మెడికల్ షాప్ ఓనర్

క్యాంపస్‌లలో టోల్‌ఫ్రీ నంబర్, క్యూఆర్ కోడ్ ఏర్పాటు…..

(విజయ భారతి ): హైదరాబాద్: న్యూస్ జూలై 25

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఏ ఘటన జరిగినా ఆయా యాజమాన్యాలు కూడా బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకుసూచించారుఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులనుఆదేశించారు.విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు విద్యా సంస్థల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని, క్యాంపస్ వెలుపల జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం సేకరించే వ్యవస్థనురూపొందించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యా సంస్థలో డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు టోల్‌ఫ్రీ నంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు.డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని గుర్తించడం, బాధితులను డీ-అడిక్షన్ సెంటర్లకు పంపించి కౌన్సిలింగ్ అందించడం, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి మూడుదశల్లోసమర్థవంతంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఈగల్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు పలువురుఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *