Breaking News

రంగారెడ్డి కలెక్టరేట్లో విషాదం తుపాకితో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ బాలకృష్ణగౌడ్‌ (28) ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ కానిస్టేబుల్ తన తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ S/o సత్తయ్య, వయస్సు: 28 సంవత్సరాలు. Occ- AR కానిస్టేబుల్ నం. 8596, RCK రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏ ఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

తాను గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం 03:30 గంటలకు విధుల్లో ఉండగానే తన తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *