విడాకులు తీసుకున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
శేరిలింగంపల్లి మాదాపూర్ విజయ భారతి న్యూస్ ; భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న భర్త ప్రవర్తన మారలేదని ఆ వివాహిత మాదాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనకు తన కుటుంబ సభ్యులకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి చెడు సందేశాలు, నగ్న ఫొటోలు పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ కు చెందిన బాధితురాలు సరెడ్డి శ్వేత తన భర్త తిరుమలరెడ్డితో విడాకులు తీసుకుంది. అయితే ఇటీవల ఆమెకు తెలియని నెంబర్ల నుంచి తన మాజీ భర్త చెడు సందేశాలు, నగ్న ఫొటోలు పంపిస్తున్నాడని. ఈ ఫొటోలు సోషల్ మీడి యాలో పోస్టు చేస్తానని ఆమెను బెదిరిస్తున్నాడని దాంతో విసుగు చెందిన బాధితురాలు తన మాజీ భర్తపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుమలరెడ్డిపై సెక్షన్ 66(ఇ) 67(ఎ) ఐటీ యాక్ట్ కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
