Breaking News

నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతు…

నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతు…

ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర విడాలని నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం…

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని గోనుగోప్పుల గ్రామంలో రైతులను నిండా ముంచిన నకిలీ విత్తనాల వ్యాపారులు వరి ఇత్నపు వడ్ల సంచి ఒక్క సంచికి 600 రూపాయలు అమ్మ వలసిన చోట దానిని రెట్టింపు చేసి 950 రూపాయలకు శ్రీరామ సీడ్స్ మరియు కావేరి సీడ్స్ పేరుతో నకిలీ విత్తనాల దందా వెలుగులోకి వచ్చింది. గోనుగోప్పుల గ్రామంలోని ఇద్దరు పార్టీలైజర్స్ యజమానులు చేసిన నిర్వాహకం దాదాపు వందల మంది రైతులు వీరిని నమ్మి నారు పోసి పొలం వేసి నాలుగు నెలలు కావస్తున్న పంట చేతికి రాకపోవడంతో అప్పుడు రైతులు ఇవి నకిలీ విత్తనాలని వేరే వారి పొలాలు కోతకు వస్తున్నాయి గాని వీరు వేసినటువంటి పంట పొలాలు ఇంకా ఈనకుండా పచ్చగానే ఉన్నాయి. వేరే సీడ్ పెట్టిన వారికి పంట చేతికొచ్చింది. శ్రీరామ్ మరియు కావేరి సీడ్స్ పేరుతో రైతులను నిండా ముంచారని గ్రామంలోని ఈ రెండు పార్టీలైజర్స్ ల యజమానులపై చర్యలు తీసుకోవాలని వారిని చరవాణిలో సంప్రదించగా ఎటువంటి స్పందన కూడా లేదని రైతులు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతి రైతుకు నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర విడి ఫర్టిలైజర్ల యజమానులపై కేసులు పెట్టి విటిపై చర్య తీసుకుని రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని మా రైతులను ఆదుకోవాలని గోనుగోప్పుల గ్రామంలోని రైతులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *