శేరిలింగంపల్లి హఫీజ్ పేట్ విజయభారతి న్యూస్ ;
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మధినాగుడా ద్వారక నగర్ కాలనీ శ్రీకృష్ణ దేవాలయంలొ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఉత్సవాలలో తెలంగాణ జన సమితి పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జ్ ఇమామ్ హుస్సేన్ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు వడ్డించారు.
ఇమామ్ హుస్సేన్ మాట్లాడుతూ. శ్రీ సీతారాముల వారి కృపా కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే, స్వామి వారి కృప ప్రజలందరిపై ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
