Breaking News

రోడ్డెక్కిన రైతన్నలు…

రోడ్డెక్కిన రైతన్నలు…

కడ్త పేరుతో 300 గ్రాములు నొక్కేస్తున్న సొసైటీ ఐకెపి రైతులు నష్టపోయిన అధికారులు పట్టించుకోరా..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ…

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని గోనుగోప్పుల గ్రామంలో రైతులు రోడ్డెక్కారు కష్టపడి పండించిన పంటను కడ్తతా పేరుతో సొసైటీ మరియు ఐకెపి ఆధ్వర్యంలో నిండా ముంచుతున్నారని రైతులు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ఎక్కడలేని విధంగా మా గ్రామంలోనే వేల లక్షల రూపాయలు కడ్త పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకున్న నాథుడు కరువయ్యాడని ఇకనైనా ఈ కడ్తకు అడ్డుకట్ట వేయాలని 41 కిలోల 500 గ్రాములు జోకాల్సిన కాడ 41 కిలోల 800 గ్రాములను జోకుతో 300 గ్రాముల కడ్తతాను ఎక్కువగా జోకుతున్నారని దీని ద్వారా రైతులము నష్టపోతున్నామని ఇదే కాక లోడ్ అయిన తర్వాత రైస్ మిల్లుకు లారీ లోడు వెళ్లినప్పుడు అక్కడ క్వింటాలుకు రెండు కిలోలు మూడు కిలోలు కట్ చేసుకుని రైతులపై భారం మోపుతున్నారని వానకు తడిసి ఎండకు ఎండి కష్టపడి పంట పండిస్తే కడ్తా పేరుతో రైతులను నిండా ముంచుతున్నారని ఇకనైనా ప్రభుత్వం చొరవచూపి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సొసైటీ ఐకెపి సెంటర్లను పటిష్ట పరచాలని రైతులు పండించే పంటకు ఎటువంటి కడ్తా లేకుండా కొనాలని రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని ఇకనైనా మాకు పరిష్కారం చూపాలని రైతులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *