Breaking News

అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి కళ్యాణం మహోత్సవం

శేరిలింగంపల్లి హఫీజ్ పేట్ విజయ భారతి న్యూస్, హాఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జీడిగింజల కిష్టయ్య ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ ఆవరణలో గత రెండు రోజులుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమ అనంతరం శ్రీ పోచమ్మ కల్యాణ మహోత్సవాన్ని ఒగ్గు కళాకారులు మరియు వేద పండితులు కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఈ కల్యాణోత్సవాన్ని తిలకించారు.అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. వారిలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, వడ్డే జైపాల్, వాల హరీష్ రావు, ధాత్రీ నాథ్ గౌడ్, బోయిని మహేష్ యాదవ్, సహా పలువురు ప్రముఖులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారికి మహిళలు ఓడి బియ్యం, చీరలు కట్నకానుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ కళ్యాణం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జీడిగింజల వెంకటేశ్,ముద్దంగుల మల్లేష్, కొల్లూరు మల్లేష్ యాదవ్,పి.జనార్ధన్ గౌడ్,జి. బాలరాజు, వి, రవి, వి.రమేష్, పి,రవి,రమేష్,శ్రీనివాస్ గౌడ్,దర్శన్, రమేష్ బండారి, అంకేనపల్లి ఆంజనేయులు, జంగయ్య, అంకేనపల్లి రమేష్ యాదవ్, ఎల్లారావు, పరమేష్,నవీన్,పోచయ్య, అశోక్, మహేశ్,విష్ణు, శేఖర్,మల్లేష్,సురేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *