కోర్టు ఆర్డర్ ఉన్న తమ భూమి వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం అమానుషం
తమపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలి..
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు..
విజయభారతి ,ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 607/3 ఒక ఎకరా 20 గుంటల భూమి లో కోర్ట్ ఆర్డర్ తో వచ్చిన తమఫై దాడికి యత్నించడం ఆమానుషమని బాధితులు అన్నారు.ఈ సందర్బంగా బాధిత మహిళ గంగవరపు లక్ష్మీపద్మ మీడియాతో మాట్లాడుతూ
…2003 ఫిబ్రవరిలో తమ అవసరాల కోసం 10 లక్షలు గంగవరపు మోహన్ రావు సుశీల దంపతులు తమ వద్ద తీసుకున్నారని తెలిపారు.2004 జూన్ లో ల్యాండ్ అక్విషన్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసిన తమను మోసం చేసి,తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలెమని 2004 నవంబర్ 4న నాదర్గుల్ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 607/3లో రెండు ఎకరాల భూమిని సేల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. మాట మార్చి కొన్ని రోజుల తర్వాత మిగతా తమ వద్ద ఉన్న భూమి కూడా అమ్మేసి కలిపి డబ్బులు తీసుకుందామని మోసాపూరితమైన మాటలు చెప్పి, మాట నిలబెట్టుకోకుండా మాట తప్పారని తెలిపారు. డబ్బులు తీసుకొని మాకు భూమి పొజిషన్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందుల గురిచేస్తుంటే, గత్యంతరం లేక కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. హైకోర్టు రిటిపిటిషన్,భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ తమకు అనుకూలంగా భూమి పొజిషన్కు వెళ్లొచ్చని కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా కానీ ఇక్కడ వీళ్లు అడ్డుపడుతుండడం, మళ్ళీ పోలీసులు తిరిగి వారికే సహకరించడం తమకు విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ఆదిబాట్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి పిర్యాదు చేస్తే కూడా తీసుకోలేదన్నారు.కోర్టు ఆర్డర్ తో అడ్వకేట్ సూచనలే మేరకు న్యాయపరంగా తాము తమ భూమిపై హక్కు ఉందని, కడీలు పాతడానికి వస్తే సుశీల, ఆమె కూతురు పావని తమతో గొడవపడి దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ, దాడి చేసే ప్రయత్నం చేశారని, తమ ఫోన్ ను సైతం పగలగొట్టారని తెలిపారు. కోర్టు ఆర్డర్ కు పోలీసులు కూడా తమకు సహకరించి తమ భూమి పొజిషన్కు వెళ్లే విధంగా సహకరించాలని మీడియా ద్వారా కోరుకున్నట్లు తెలిపారు